“ ఓహోహో అనరో పారి , సాహసాన తిరుగరో జంట పారి “ -
ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తున్న యీ “కొరోనా " కట్టడి పరిస్థితియే ఏర్పడినది. బయట తిరగాలన్నా , ఒంటరిగానే ,జత లేకుండా తిరగాల్సిందే. ఉఫ్,,ఓహో , ఏ పరిస్ధితిది ? అని అనాల్సి వచ్చిందట. ఆ రోజుల్లో , ఏమేమిజరిగిందంటే ....
పేనిపెట్టి వాకిళ్ళ బీగముద్రలాయ నిడి , కానిమ్మని వాయించరో గంట పారి “
అందరికోరికలు తీరిచే ఆ వేంకటేశుడే , కోరి నిద్రపోవాలనుకొన్నాడు. అంటే, విస్రాంతి కొరుతున్నాడు.. కాబట్టి , గుడి ద్వారములు మూసివేయబడినవి. ఎలాగ?, పేనినతాళ్ళతోగట్టి, తాళాలు బిగించి, సీలు వేశారట. సీలు వేయడమంటే , ఒక్కరోజుగాదు, రెండు రోజులుగాదు , చాలా
చాలా రోజులు మూసివేశారని తెలియబడుతోంది . గుడి గంటలు మాత్రమే, టైం చూచి మోగించబడ్డవి. ఆ శ్రీనివాసునికి ప్రశాంతత కావాలట. ఎలాగ? ఈలాగ ......
“ తిరుపణి మణగెను తిరుగరాదెవ్వరికి , మరల నెలుగియ్యరో మగపారి
పరగ దేవతలెల్ల బడకెళ మున్నారు , ఇరవాయ సూర్యచంద్రులెదురుపారి “
తిరుపతి నిశ్శబ్దంగా ఉండాలికనుక, ఎవ్వరూ బయట తిఱుగకూడదు. మణగెను అంటే , మౌనముగా అయినది అని అర్ధం. కొండమీద, స్వామితో బాటున్న దేవతలు కూడా అలసట తీర్చుకుంటున్నారు ... ఏమి దృశ్యమైయిందంటే, సూర్యచంద్రులెదురెదురుగా , గ్రహణ స్థితిలో
నిలచుట. ఓహో, ఓహోహో ,అనేక తప్పదు ... తిరుపతి మొత్తం నిశ్శబ్దం, నిర్బంధం పాటించింది.
గ్రహణం ముగిసినాక, తలారి ఎలుగెత్తి “హోషియారీ “ చెప్తాడు.
“శ్రీవేంకటేశుడు చిత్తగించీ లోననదె , కోవరము ఎన్నికరో కోటిపారి
ఆవల బంగారు గుడియలు ఘల్లురనగా , తావుల హనుమంతు తలారి పారి “
మూసివేసిన గుడి వెలుపల నుండే , కోరికలు కోరుకోండి. కోటి కోరికలైనా కోరుకోండి , పరవాల్లేదు. లోపలినుండే విని , శ్రీవేంకటేశ్వరుడు కోరిన వరాలు తీరుస్తాడు .. లోన బంగారు గుండిగలు ఘల్లు ఘల్లు మంటున్నాయి. అంటే , లోన శ్రీ మహాలక్ష్మి యున్నది , అని అర్ధము.
మూసివేయబడ్డ కోవెలను కాపలాకాయుచూ , శ్రీ ఆంజనేయస్వామి రక్షకుడై వున్నాడు.
ఇదిఅంతా చూచి , ఓహోహో అనకతప్పదు, అంటున్నారు శ్రీ అన్నమాచారులవారు.
అది అన్నమయ్య కాలం. ఇది అత్యాధునిక కాలం. కాలం వేరే కానీ , కష్టాలు అవే .
అదే వేంకటేశుడు, అదే కోవెల , అదే సూర్యచంద్రులు, అదే దేవస్థానము, అదే విషమ పరిస్థితి, నాడు -నేడు.
సాహసించి తిరగడం మహా ప్రమాదమైన విషమ విష పరిస్థితి.
అది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి