18, జులై 2020, శనివారం

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో  జంట  పారి “    -        

ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తున్న  యీ  “కొరోనా " కట్టడి పరిస్థితియే  ఏర్పడినది. బయట తిరగాలన్నా , ఒంటరిగానే ,జత  లేకుండా  తిరగాల్సిందే. ఉఫ్,,ఓహో , ఏ  పరిస్ధితిది ? అని అనాల్సి వచ్చిందట.  ఆ  రోజుల్లో , ఏమేమిజరిగిందంటే .... 


“కోనేటిరాయడు   కోరి  నిద్రించీ  వాడే , ఆనకమై  జాలీయరో   అడు బారీ 
పేనిపెట్టి  వాకిళ్ళ  బీగముద్రలాయ  నిడి , కానిమ్మని  వాయించరో  గంట పారి “
    అందరికోరికలు తీరిచే  ఆ వేంకటేశుడే , కోరి నిద్రపోవాలనుకొన్నాడు. అంటే, విస్రాంతి  కొరుతున్నాడు.. కాబట్టి , గుడి ద్వారములు  మూసివేయబడినవి.  ఎలాగ?,  పేనినతాళ్ళతోగట్టి, తాళాలు బిగించి, సీలు వేశారట.  సీలు వేయడమంటే , ఒక్కరోజుగాదు, రెండు రోజులుగాదు , చాలా 

చాలా రోజులు మూసివేశారని తెలియబడుతోంది . గుడి గంటలు మాత్రమే, టైం చూచి మోగించబడ్డవి. ఆ  శ్రీనివాసునికి  ప్రశాంతత కావాలట. ఎలాగ? ఈలాగ ......   

      “  తిరుపణి   మణగెను  తిరుగరాదెవ్వరికి , మరల నెలుగియ్యరో   మగపారి 
                  పరగ   దేవతలెల్ల  బడకెళ మున్నారు ,  ఇరవాయ  సూర్యచంద్రులెదురుపారి “ 

తిరుపతి  నిశ్శబ్దంగా ఉండాలికనుక,  ఎవ్వరూ బయట  తిఱుగకూడదు. మణగెను అంటే , మౌనముగా అయినది  అని అర్ధం. కొండమీద, స్వామితో  బాటున్న దేవతలు కూడా  అలసట తీర్చుకుంటున్నారు ... ఏమి దృశ్యమైయిందంటే,  సూర్యచంద్రులెదురెదురుగా , గ్రహణ స్థితిలో 
నిలచుట. ఓహో, ఓహోహో ,అనేక తప్పదు ... తిరుపతి  మొత్తం  నిశ్శబ్దం, నిర్బంధం పాటించింది. 
గ్రహణం ముగిసినాక, తలారి  ఎలుగెత్తి “హోషియారీ “ చెప్తాడు. 

“శ్రీవేంకటేశుడు  చిత్తగించీ   లోననదె ,   కోవరము   ఎన్నికరో   కోటిపారి 
ఆవల  బంగారు గుడియలు  ఘల్లురనగా , తావుల  హనుమంతు  తలారి  పారి “ 

           మూసివేసిన గుడి వెలుపల నుండే , కోరికలు కోరుకోండి. కోటి కోరికలైనా  కోరుకోండి ,  పరవాల్లేదు. లోపలినుండే  విని , శ్రీవేంకటేశ్వరుడు  కోరిన వరాలు  తీరుస్తాడు .. లోన  బంగారు  గుండిగలు  ఘల్లు ఘల్లు మంటున్నాయి. అంటే , లోన శ్రీ మహాలక్ష్మి యున్నది , అని అర్ధము. 
మూసివేయబడ్డ  కోవెలను  కాపలాకాయుచూ ,  శ్రీ ఆంజనేయస్వామి  రక్షకుడై వున్నాడు.  
ఇదిఅంతా చూచి , ఓహోహో  అనకతప్పదు, అంటున్నారు శ్రీ అన్నమాచారులవారు. 

అది అన్నమయ్య కాలం.  ఇది అత్యాధునిక  కాలం.  కాలం వేరే  కానీ , కష్టాలు అవే . 
అదే  వేంకటేశుడు, అదే కోవెల , అదే సూర్యచంద్రులు, అదే దేవస్థానము, అదే  విషమ పరిస్థితి, నాడు -నేడు. 
సాహసించి తిరగడం మహా  ప్రమాదమైన విషమ విష పరిస్థితి. 
అది 



        



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...