2, అక్టోబర్ 2018, మంగళవారం

అన్నమయ్య గీతార్ధం

  అన్నమయ్య , వేదోపనిషత్తులు, భగవద్గీతోపనిషత్తులను  కాచి వడపోసిన మహా జ్ఞాన ధర్మజ్ఞుడు. 
ఇన్ని వేల సంకీర్తనలను  అనర్గళంగా  పాడడం  సామాన్యులకయ్యే  పని కాదు.  భక్తి ఙ్నానా ల భావ 
సమ్మేళనం, అన్నమాచార్యులవారి ప్రతి గీతం. 

“ బ్రహ్మం  పరబ్రహ్మం ,  జ్ఞానం  జ్ఞేయం,  జీవాత్మ పరమాత్మ “ అనే  విషయాలను గూర్చి , భగవద్గీతలో ని  సంస్కృతభాషనుండి ,  తెలుగుభాషలో సంకీర్తన రూపంలో వివరించి , ఈ లాగ  పాడారు. వేదాలు చెప్పిందీ ఇదే , అని  గెంతుతూ డేం డేం అని అరుస్తూ చెప్తున్నారు. 

“ఓహో డేం డేం ఒగి  బ్రహ్మమిదియని , సాహసమున  శృతి చాటెడిది “. (396, సంపుటం )

                “     పరము  దేవుడును ,  అపరము  జీవుడు 
                      తిరమైన  ప్రక్రుతి యే  దేహము “

“జ్ఞానము  జ్ఞేయము  జ్ఞానగమ్యమున , పూని తెలియుటే  యోగము 
జ్ఞానము  దేహాత్మ , జ్ఞేయము పరమాత్మ , జ్ఞానగమ్యమే  సాధించు మనసు “

మనస్సును  నిగ్రహించి, ఈజీవాత్ముడు,  జ్ఞానమార్గంలో , జ్ఞానంతో  జ్ఞానగమ్యమైన  పరమాత్మను  తెలిసికొనుటయే  నిజమైన  యోగం , అని అన్నమయ్య భావం. అదే , భగవద్గీతలోని  క్షేత్ర క్షేత్రజ్ఞ     విభాగయోగంలో  చెప్పియున్నది యిలా. .........   

       “    జ్యోతిషామపి  తత్జ్యోతిహి  తమసః  పరముచ్యతే 
              జ్ఞానం  జ్ఞేయం  జ్ఞానగమ్యం  హృది  సర్వస్య విష్టితం  “   

ఏ  వెలుగు సృష్ఠి యంతయూ  వ్యాపించియుండి, ఏ తన ప్రకాశముతో  చీకటిని పారద్రోలుచున్నదో , 
అదియే,   “ పరము “ అని పిల్వబడుచున్నది. ఆ వెలుగే  జ్ఞానరూపం. ఆ వెలుగే  దైవరూపం  . ఆ వెలుగే హృదయంలో నున్న “మనసు “. అంటే , మనస్సే  సర్వవ్యాపియైన  పరమాత్మ .   

ఈ  శరీరం సహాయంతో,  ఆ పరమాత్ముని  తెలిసికోవడమే  జన్మసార్థకత .   
                           
మనసే మనస్సును తెలియగలదు . అదే  వేదాంత రహస్యం. 
అదే అన్నమయ్య సంకీర్తన గీతాబోధ. 

            అన్నమయ్య మాట 
   
                      



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...