అన్నమయ్య ఎన్నో వందల సంకీర్తనలు , శ్రీ కృష్ణునిపై పాడారు. సంకీర్తనల ద్వారా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలియజేసారు. ఎన్నో కృష్ణుని లీలలు వర్ణిస్తూ పాడారు. శ్రీ కృష్ణుడు, విష్ణు దేవుని అవత్తరమౌట వల్ల , విష్ణుడే అంతాయనే భావన అన్నమయ్య పాటలలో చాలా చక్కగా కనిపిస్తుంది.
ఒక సంకీర్తనలో, విష్ణుని శ్రీ కృష్ణుని లీలలు సమ్మేళవించి, ఎంతో మనోహ్లాదంగా పాడారాయన.
చిన్ని కృష్ణుడు ఆడుతూ ఆడుతూ మట్టి తినగా , యశోదాదేవి, ఆ ముద్దు బాలకృష్ణుని , నోరుతెరిచి చూపించమన్నది. అద్భుతంగా, 14 భువనబాండాలు కనిపించినవట. ఆ కృష్ణ పరమాత్మునిలోనే
సర్వసృష్టి వున్నది, అని ఆమెకు తెలిసిపోయింది.
అల్లాగే , తన మిత్రులతోకూడి బాలకృష్ణుడు ఆటలాడడానికి పోగా, హాఠాత్త్తుగా ఉరుములతో, మెరుపులతో , కుంభవృష్టి పడడమైంది. అప్పుడు , శ్రీకృష్ణుడు“ గోవర్ధన పర్వతమును “ ఎత్త్తి,తన చితికినవేలుమీద నిలిపి, ఆ గోపాలలులనందరిని , ఆ పర్వతముక్రిందన బసచేయించెనట.
ఎన్ని దినములు. ? ఒక్కటా, రెండా?? “ఏడు రోజులు ” అలా వర్షమాగకుండా పడుతోనే వున్నది,
శ్రీ గోపాల కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికిన వేలుపై నిలిపి, యెత్తి నిలుచునేవున్నాడట.
ఎటువంటి అద్భుతమైన సన్నివేశమిది !! ఏడురోజులు ఒక కొండనెత్త్తి , చితికినవేలుపైనిలిపి, నిలుచుకోవడం , ఏ మానవమాత్రుడికైనా సాధ్యమా?? ఒక్క భగవంతునికే సాధ్యము.
ఈ మహాద్భుత సన్నివేశాన్ని, బాలకృష్ణుని లీలను అన్నమయ్య , క్రింది సంకీర్తలో యిలాగ, బహుచక్కగా వర్ణించారు.
“ అతి బ్రహ్మామ్డాలు కుక్షి నటు ధరించినట్టి ఆతనికి చేయరో ఆరగింపులు
ప్రతిలేని క్షీరాభ్ది పవళించి లేచినట్టి , చతురునికి చేయరో చవినారగింపులు
పల్లవి :
వేకువ తిరుపళచ్చి విష్ణునికి చేయరో , ఆకటికి ఒదగినట్టి ఆరగింపులు —( 3, సంకీర్తన 298 )
“ ఏడు దినముల దాకా నెత్తెను గోవర్ధనము
ఆడి వఛ్చిన బాలునికి ఆరగింపులు “
ఈలాంటి భాగవత రహస్యాలనెన్నింటినో తన పాటలలో నిక్షిప్తముగా తెలిపారు , శ్రీ అన్నమాచార్య .
అన్నమయ్య మాట
ఒక సంకీర్తనలో, విష్ణుని శ్రీ కృష్ణుని లీలలు సమ్మేళవించి, ఎంతో మనోహ్లాదంగా పాడారాయన.
చిన్ని కృష్ణుడు ఆడుతూ ఆడుతూ మట్టి తినగా , యశోదాదేవి, ఆ ముద్దు బాలకృష్ణుని , నోరుతెరిచి చూపించమన్నది. అద్భుతంగా, 14 భువనబాండాలు కనిపించినవట. ఆ కృష్ణ పరమాత్మునిలోనే
సర్వసృష్టి వున్నది, అని ఆమెకు తెలిసిపోయింది.
అల్లాగే , తన మిత్రులతోకూడి బాలకృష్ణుడు ఆటలాడడానికి పోగా, హాఠాత్త్తుగా ఉరుములతో, మెరుపులతో , కుంభవృష్టి పడడమైంది. అప్పుడు , శ్రీకృష్ణుడు“ గోవర్ధన పర్వతమును “ ఎత్త్తి,తన చితికినవేలుమీద నిలిపి, ఆ గోపాలలులనందరిని , ఆ పర్వతముక్రిందన బసచేయించెనట.
ఎన్ని దినములు. ? ఒక్కటా, రెండా?? “ఏడు రోజులు ” అలా వర్షమాగకుండా పడుతోనే వున్నది,
శ్రీ గోపాల కృష్ణుడు గోవర్ధన గిరిని చిటికిన వేలుపై నిలిపి, యెత్తి నిలుచునేవున్నాడట.
ఎటువంటి అద్భుతమైన సన్నివేశమిది !! ఏడురోజులు ఒక కొండనెత్త్తి , చితికినవేలుపైనిలిపి, నిలుచుకోవడం , ఏ మానవమాత్రుడికైనా సాధ్యమా?? ఒక్క భగవంతునికే సాధ్యము.
ఈ మహాద్భుత సన్నివేశాన్ని, బాలకృష్ణుని లీలను అన్నమయ్య , క్రింది సంకీర్తలో యిలాగ, బహుచక్కగా వర్ణించారు.
“ అతి బ్రహ్మామ్డాలు కుక్షి నటు ధరించినట్టి ఆతనికి చేయరో ఆరగింపులు
ప్రతిలేని క్షీరాభ్ది పవళించి లేచినట్టి , చతురునికి చేయరో చవినారగింపులు
పల్లవి :
వేకువ తిరుపళచ్చి విష్ణునికి చేయరో , ఆకటికి ఒదగినట్టి ఆరగింపులు —( 3, సంకీర్తన 298 )
“ ఏడు దినముల దాకా నెత్తెను గోవర్ధనము
ఆడి వఛ్చిన బాలునికి ఆరగింపులు “
ఈలాంటి భాగవత రహస్యాలనెన్నింటినో తన పాటలలో నిక్షిప్తముగా తెలిపారు , శ్రీ అన్నమాచార్య .
అన్నమయ్య మాట
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి