31, ఆగస్టు 2018, శుక్రవారం

జననమరణములు

అన్నమయ్య  మహా జ్ఞాని. ఆయన  వేదోపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలను  అవపోసనపట్టిన వేదాంతి. స్వయం విష్ణ్వామ్స సంభూతుడు. ఈ  భూమిమీద పుట్టిన ప్రతి జీవికి సుఖదుఃఖములు , కష్టసుఖములు, జనన మరణములు ,ఆసా పాశములు తప్పవు, ఎవ్వరు తప్పించుకోలేరు అని నొక్కి చెప్పిన మహా ఆచార్యులు, అన్నమయ్య. ఏ  జాతివారికైనా , ఏ దేశమువారికైనా సంసారయోగము ఒక్కటే. ఒక్కటే.
అది ఏమిటో  అంటే , ఇది అని, క్రింది మాటలలో చెప్తున్నారు.

                      పుట్టినవానికెల్లా భువి మరణము నిత్యము,
                        అట్టే  చఛ్చినవారికి  అవ్వల జననము

భూమిమీద  జన్మమెత్తిన  వారెవ్వరైనా  గిట్టక తప్పదు.  ఇది అపర సత్యము. సృష్టి నియమము.

భగవద్గీత లో   “ జాతస్యహి ధ్రువో మృత్యుహు, ధృవం జన్మ మృతస్యచ “  అని చెప్పబడినది.
పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు, పోయిన ప్రతి జీవి పుట్టక తప్పదు. ఈ, ఈ  నిజం తెలిసి  జీవించడమే
ఒక కళ . 
జీవుడు ఎన్నో జన్మల చక్రంలో పరిభ్రమించుతూవుంటాడు. మనము దుస్తులు మార్చినట్లే  ఒక్కొక్క జన్మలో,  ఒక్కొక్క  రూపధారణ చేయడం జరుగుతుంది. ఈ చక్రభ్రమణం నుండి  తప్పించుకోడానికి మార్గం ఏమిటంటే, ధర్మబద్ధమైన  పనులు  చేస్తూ జీవించడమే. ఇదే వివేకవంతమైన  జీవితము.

మనముందున్నదంతా  దైవీకమైనదని,  సర్వమూ  దేవదత్తమని , మనము  నిమిత్తమాత్రులమని,  తెలిసి
యీ  అరుదైన  మానవ జన్మని జాగ్రత్తగా, ధర్మబద్ధంగా  గడపడమే, “ సంసారయోగము “ అని చెప్తున్నారు, అన్నమయ్య.

జీవుడు నిత్యుడు  ఏమిటా చెరుపగరానివాడు
ఈ వివేకము  తెలిసి  ఏ  జాతివారైనా
దైవీకమే  నమ్మి  తమ ధర్మములబాయరాదు
సావధానమిదియే  సంసార యోగము 

జనన  మరణముల నడుమనున్న  జీవిత కాలమును సత్యమార్గములో ,  ధర్మమార్గములో  నడపమని,
అన్నమయ్య   సావధానం చేస్తున్నారు. పుట్టుట పోవుట చాలా చేదు నిజము.  కానీ  ఒప్పక తప్పదు గదా !


                      అన్నమయ్య మాట 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గుడికితాళం— క్రోనా కాలం

                 “ ఓహోహో  అనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి “    -         ఒకానొక సంధర్భంలో , తిరుపతిలో కూడా , ఈనాడు మనమనుభవిస్తు...